హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మైక్రో ఫైనాన్సు వేధింపుల కారణంగా 45 రోజుల్లో 30 మంది ఆత్మహత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Microfinance
హైదరాబాద్: మైక్రో ఫైనాన్సుల వేధింపుల కారణంగా గత 45 రోజుల్లో 30 మందికి పైగా మరణించారు. మైక్రో వేధింపులతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మరికొందరు ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో మైక్రో ఫైనాన్సు ఏజెంట్ల వేధింపులు అధికం కావటంతో ప్రభుత్వం మేలుకొని ఆర్డినెన్సు జారీ చేసింది. అయితే ఆ ఆర్డినెన్సు ప్రతిపక్షాల విమర్శలను తట్టకునేందుకు హడావిడీగా జారీచేసిన ఆర్డినేన్సా లేక మైక్రో ఫైనాన్సర్ల ను అదుపులో పెట్టడానికా అన్నది ముందు ముందు తెలుస్తంది. 45 రోజుల్లోనే 30 మంది ఆత్మహత్య చేసుకోవడమనేది ఎవరూ జీర్ణించుకోలనేని విషయం.

ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన నుంచి వచ్చీ రాగానే మంత్రులతో సమావేశం ఏర్పరచి ఆ తరువాత ప్రత్యేక చట్టం కోసం గవర్నరు ఆమోదానికై పంపారు. గవర్నరు సైతం అప్పటికప్పుడు ఆమోదించి తిరిగి పంపారు. ఆ తెల్లవారు మంత్రి వట్టి వసంత కుమార్ మైక్రో ఫైనాన్సర్ల వేధింపులను అరికట్టడానికి ప్రత్యేక చట్టంలో ఉన్న నిబంధనలకు విలేకరుల సమావేశంలో వివరించారు. అయితే అందులో హడావిడి తప్పితే మైక్రోలను అరికట్టడానికి ఎలాంటి పటిష్టమైన చర్యలు లేవని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నవి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X