మైక్రో ఫైనాన్సు వేధింపుల కారణంగా 45 రోజుల్లో 30 మంది ఆత్మహత్య
ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన నుంచి వచ్చీ రాగానే మంత్రులతో సమావేశం ఏర్పరచి ఆ తరువాత ప్రత్యేక చట్టం కోసం గవర్నరు ఆమోదానికై పంపారు. గవర్నరు సైతం అప్పటికప్పుడు ఆమోదించి తిరిగి పంపారు. ఆ తెల్లవారు మంత్రి వట్టి వసంత కుమార్ మైక్రో ఫైనాన్సర్ల వేధింపులను అరికట్టడానికి ప్రత్యేక చట్టంలో ఉన్న నిబంధనలకు విలేకరుల సమావేశంలో వివరించారు. అయితే అందులో హడావిడి తప్పితే మైక్రోలను అరికట్టడానికి ఎలాంటి పటిష్టమైన చర్యలు లేవని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నవి.
Comments
Story first published: Sunday, October 17, 2010, 11:43 [IST]