బీహార్ లో నితీష్ కుమార్ దే మళ్లీ అధికారం: ఒపీనియన్ పోల్

దాదాపు 42 శాతం ప్రజలు నితీష్ కుమార్ సుపరిపాలనకు ఓటేస్తున్నారు. నితీష్ కుమార్ పాలన చాలా బాగుందని 31 శాతం మంది అభిప్రాయపడ్డారు. రోడ్లు, రవాణా వ్యవస్థ, విద్య, వైద్యం వంటి సౌకర్యాలు చాలా మెరుగయ్యాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ అర్హుడని 65 శాతం మంది అభిప్రాయపడ్డారు. లాలూ ప్రసాద్ యాదవ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా 16 శాతం మంది మాత్రమే బలపరిచారు. నితీష్ కుమార్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడగలరని 70 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు.
బీహార్ లో కాంగ్రెసు పరిస్థితి కాస్తా మెరుగయ్యే అవకాశం ఉంది. బీహార్ లో కాంగ్రెసు 22 సీట్లు గెలుచుకుంటుందని ఒపినీయన్ పోల్ లో తేలింది. ఇది గతంలో కన్నా రెండింతలు. ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెసుకు 9 సీట్లు మాత్రమే ఉన్నాయి. రాహుల్ గాంధీ ప్రచారం వల్ల బీహార్ లో ఓట్ల శాతం కాంగ్రెసుకు 6.1 శాతం నుంచి 10 శాతానికి పెరిగినట్లు అంచనా.












Click it and Unblock the Notifications