హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆత్మహత్యల బాధ్యత చేతకాని రోశయ్య ప్రభుత్వానిదే: చంద్రబాబు నాయుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: మైక్రో ఫైనాన్సుల ఆగడాలపై రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని చంద్రబాబు అన్నారు. ఆయన మెదక్ జిల్లా గజ్వేల్ పర్యటకు వెళ్లేముందు హైదరాబాద్ లోని తెలుగు దేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మైక్రో ఫైనాన్సుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆయన ఓదార్చడానికి మెదక్ వెళ్లారు.

ప్రభుత్వం సూక్ష్మ రుణ సంస్ధల ఆగడాలను అరికట్టడంలో విఫలమయిందన్నారు. సూక్ష్మ రుణ సంస్థలు ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్నాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. వారి వేధింపులు తట్టుకోలేకనే ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. రైతులను సైతం ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదన్నారు. గిట్టుబాటు ధర లేక, ఎరువుల కల్తీ వల్ల రైతులు అప్పుల పాలయ్యి వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారని వాపోయారు. రైతులను, ప్రజలను ఆదుకోని చేతకాని ప్రభుత్వాన్ని ప్రజలను కోరుకోవటం లేదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X