తెలంగాణపై మా ఢిల్లీ యాత్రకు చంద్రబాబు మద్దతు: నాగం జనార్దన్ రెడ్డి

కాగా, తెలుగుదేశం నాయకుడు దేవేందర్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాజకీయ లబ్ధి కోసం తెలంగాణను కొంత మంది వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామిక వాతావరణాన్ని చెడగొడుతున్నారని ఆయన అన్నారు. తాము నిజాయితీగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ అంశాన్ని రాజకీయ క్రీడగా మార్చేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ అంశం కీలకమైన దశకు చేరుకుందని, ఎవరేమన్నా తమ ఢిల్లీ యాత్ర తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం తమతో అన్ని పార్టీలు, సంఘాలు కలిసి రావాలని ఆయన కోరారు.
అయితే, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు ప్రత్యేకమైన జండాలు ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ చిత్ర పటం ముద్రించిన పచ్చ జెండాలను వారు ప్రదర్శించారు. ఆ జెండాపై తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు బొమ్మ గానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి బొమ్మ గానీ లేదు. వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications