హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరోసారి ఒయులో రగడ: నలుగురు విద్యార్థుల ఆమరణ నిరాహార దీక్ష

By Pratap
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్: హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం మరోసారి రగలనుంది. నవంబర్ 1వ తేదీన రాష్ట్రావతరణ దినోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకూడదని, ఉత్సవాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నలుగురు విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. విక్రమ్, నవీన్, బాలరాజు, రవి అనే నలుగురు విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో మరోసారి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనే ప్రమాదం ఏర్పడింది.

నవంబర్ 1వ తేదీన జరిపే రాష్టావతరణ దినోత్సవాలను రద్దు చేయాలని, తెలంగాణ మంత్రులు ఈ ఉత్సవాల్లో పాల్గొనకూడదని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రావతరణ దినోత్సవాల్లో పాల్గొనే మంత్రులను తెలంగాణ ద్రోహులుగా ప్రకటిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. కాగా, తెలంగాణ మంత్రులు మాత్రం ఉత్సవాల్లో పాల్గొంటామని చెబుతున్నారు. తెలంగాణ కోసం ప్రయత్నాలు సాగిస్తామని, అయితే ఉత్సవాల్లో పాల్గొంటామని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దానం నాగేందర్, పొన్నాల లక్ష్మయ్య ఇప్పటికే చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X