ముఖ్యమంత్రి రోశయ్యపై ధ్వజమెత్తిన టిడిపి అధినేత చంద్రబాబు

కేంద్ర ప్రభుత్వం నుంచి వరద సహాయక చర్యలకు నిధులు రాబట్టడంలో రాష్టానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు విఫలమయ్యారని ఆయన అన్నారు. 33 మంది కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఉన్నా రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చిన తమ పార్టీ శాసనసభ్యులను పోలీసులు అరెస్టు చేయడం అనాగరికమని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో కూడా తనకు అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. వ్యవసాయ మంత్రి రఘువీరా రెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిన అవసరం లేదా అని ఆయన అడిగారు. బియ్యం ఇవ్వాలంటే అన్నసత్రం కాదని ముఖ్యమంత్రి రోశయ్య వ్యాఖ్యానించడం పేదలను వెక్కిరించడమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications