చిరంజీవికి వైయస్ జగన్ గండం: పార్టీలో లుకలుకలు

వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొంటున్న నాయకులపై పార్టీ ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని శోభారాణి విమర్శించారు. నెల్లూరు జిల్లాలో యువరాజ్యం అధ్యక్షుడితో పాటు కార్యకర్తలందరూ జగన్ వైపు వెళ్లిపోయినట్లు సమాచారం. కర్నూలు జిల్లాకు చెందిన శాసనసభ్యురాలు శోభానాగి రెడ్డి, ఆమె భర్త భూమా నాగిరెడ్డి మొదటి నుంచీ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకునే సాహసం చిరంజీవి చేయడం లేదు. కోటగిరి విద్యాధర రావు నేతృత్వంలోని క్రమశిక్షణా సంఘం అసలు పని చేయడం లేదని అంటున్నారు. పార్టీలో ఎప్పటికప్పుడు శోభారాణి వంటి వారు చిచ్చు పెడుతూనే ఉన్నారు. అయినా కూడా చిరంజీవిలో కదలికలు లేవు. పార్టీ నాయకత్వం తీసుకున్న అల్లు అరవింద్ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications