హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒయులో నలుగురు ఎస్ఐ అభ్యర్థుల ఆమరణ నిరాహార దీక్ష

By Pratap
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఫ్రీజోన్‌ అంశం తేలేవరకూ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలు భర్తీ చేయకూడదంటూ నలుగురు అభ్యర్థులు శుక్రవారం ఆమరణ దీక్ష చేపట్టారు. ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణంలో వారు ఆమరణ దీక్ష చేపట్టారు. గతంలో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి రాష్ట్రపతికి లేఖ పంపినా ఫలితం లేదన్నారు. ఈ విషయం తేలకుండా పరీక్షలు నిర్వహించవద్దని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరుతున్నట్లు వెల్లడించారు.

అడ్డదారుల్లో ఎస్ఐ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోందని, అలా చేస్తే తాము ఆత్మత్యాగానికైనా సిద్ధపడతామని వారు హెచ్చరించారు. ఫ్రీజోన్ అంశం తేలకుండా పరీక్ష నిర్వహిస్తే ఆరో జోన్ అభ్యర్థులు నష్టపోతారని వారన్నారు. తమ డిమాండ్ ను హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X