తెలంగాణ కోసం కెసిఆర్ ఏమైనా చేస్తానన్నాడు: కాంగ్రెసు నేత కేశవరావు

తాము అధికారంలో ఉన్నాం కాబట్టి తెలంగాణ సాధన కోసం కెసిఆర్ తనను కలిశారని, తెలంగాణ కోసం ఏమైనా చేస్తానని అన్నారని, తెలంగాణ కోసం కాంగ్రెసును బలపరుస్తానని చెప్పారని ఆయన వివరించారు. తెలంగాణ సాధన శాంతియుతంగా జరగాలనేది తమ ఉద్దేశమని ఆయన చెప్పారు. తెలంగాణ వచ్చి తీరుతుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. తాము ప్రత్యేకంగా పిసిసి పెట్టుకుంటామని దివంగత నేత వైయస్సార్ అడ్డుకున్నారని ఆయన చెప్పారు. తాము రాష్టాన్ని విడదీసి, ప్రజలను కలిపి ఉంచాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల సమావేశానికి వెళ్లారనే ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. అలాంటిదేమీ లేదని ఆయన చెప్పారు. తాను ముఖ్యమంత్రి పదవి కోసం కెసిఆర్ తో మంతనాలు జరిపినట్లు వచ్చిన వార్తల్లో కూడా ఏ మాత్రం నిజం లేదని ఆయన చెప్పారు. తాను ముఖ్యమంత్రి పదవిని కోరుకోవడం లేదని, తాను ముఖ్యమంత్రిని అవుతానని కూడా అనుకోవడం లేదని ఆయన అన్నారు. తెలంగాణలో ప్రజా ఉద్యమం జరుగుతోందని, దానిపై తప్పుడు వార్తలు రాయవద్దని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications