వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసు సభకు జగన్ వర్గం కొండా దంపతులు గైర్హాజరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Surekha
వరంగల్: సోమవారం వరంగల్ పట్టణంలో జరగనున్న కాంగ్రెసు 125 సంవత్సరాల ఆవిర్భావ సభకు ఆ జిల్లాకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ, శాసనమండలి సభ్యుడు కొండా మురళీధరరావు గైర్హాజరవుతున్నట్టు సమాచారం. సోమవారం ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వరంగల్ పర్యటన ఉన్న విషయం తెలిసిందే. అక్కడ కొన్ని అభివృద్ధి పనులతో పాటు ఆవిర్భావ సభలో రోశయ్య పాల్గొంటారు. ఆ సభకు జగన్ వర్గం నేతలైన కొండా దంపతులు హాజరవటం లేదు.

ఓ శిలాపలకంపై తన పేరు లేనందున రోశయ్యపై, ప్రభుత్వంపై కొండా మురళీ ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహనరెడ్డిని తాము అభిమానిస్తున్నందువల్లనే తమను ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వం పక్కన పెడుతోందని అయన అన్నారు. రోశయ్య నామినేటెడ్ శాసనమండలి సభ్యుడు అయితే నేను ఎన్నికయిన సభ్యుడినన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురయినా జగన్ వెన్నంటే ఉంటామని, తన పేరు శిలాపలకం లేకపోవటం వైయస్ అభిమానులకు జరిగిన అవమానంగానే భావిస్తున్నామన్నారు. మా నియోజకవర్గానికి కావాలనే ముఖ్యమంత్రి నిధులు ఇవ్వడం లేదన్నారు. మాజీ మంత్రి దామోదర రెడ్డి వైయస్ దయవల్లనే ఇంతటి వాడయ్యాడన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X