ప్రభుత్వం విద్యార్థులపట్ల నిరంకుశంగా ప్రవర్తించింది: తెరాస

ప్రభుత్వం, పోలీసులు నిరంకుశంగా ప్రవర్తించి విద్యార్థుల ఉద్యమాన్ని అణిచివేయాలనుకుందన్నారు. అయితే విద్యార్థులు డిమాండుకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదన్నారు. పోలీసులు విద్యార్థుల పట్ల కర్కశంగా వ్యవహరించారన్నారు. లాఠీచార్జీలు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించటం సిగ్గుచేటన్నారు. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని వారందరికీ ప్రభుత్వం వైద్య సేవలు ఉచితంగా అందించాలన్నారు. అలాగే విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, వారిని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇల్లలకగానే పండుగ కాదని, అలాగే పరీక్షలు వాయిదా వేయడంతో ప్రభుత్వం పని అయిపోలేదని వెంటనే 14ఎఫ్ ను సవరించాలని మరో నాయకుడు శ్రవణ్ అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య అఖిలపక్షాన్ని వెంటనే ఢిల్లీకి తీసుకెళ్లాలన్నారు. హైదరాబాదు ఫ్రీజోన్ కాదని ప్రభుత్వం ప్రకటన చేయాలన్నారు. బందు చేయాలని మా ఉద్దేశ్యం కాదని, అయితే ప్రభుత్వం తీరుకు నిరసనగా మాత్రమే బందుకు పిలుపునిచ్చామని, దానిని ఉపసంహరించుకుంటున్నట్టు వారు తెలిపారు.
కాగా తమ నాయకులు రాజారాంయాదవ్, పిడమర్తి రవిలను వెంటనే విడుదల చేయాలంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఎస్ఐ రాత పరీక్షలు రద్దు చేయటంపట్ల హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు ఉస్మానియా పోలీసు స్టేషన్ ముందు తమ విద్యార్థులను విడుదల చేయాలంటూ ఆందోళన విర్వహించారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications