హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భవిష్యత్తు కార్యాచరమపై అనుచరులతో వైయస్ జగన్ మంతనాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్‌: భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవడానికి కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ విస్తృతంగా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. బెంగళూర్ లోని తన నివాసంలో ఆయన తన అనుచరులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ అధిష్టానంపై తిరుగుబాటుకే సాక్షి మీడియా సోనియాకు వ్యతిరేకంగా వార్తాకథనం ఇచ్చినట్లు తెలుస్తోంది. సొంత పార్టీ పెట్టుకోవడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే, అవసరమైన మేర కాంగ్రెసు శాసనసభ్యులను చీల్చేందుకు కూడా ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ జగన్ తరఫున శాసనసభ్యులతో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమాయత్తమవుతున్నట్లు తెలియడం వల్లనే వైయస్ జగన్ తొందరపడినట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ పూర్తి స్థాయిలో సమాయత్తం కాక ముందే రాష్ట్ర శాసనసభకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని పార్టీ అధిష్టానం ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే వైయస్ జగన్ అధిష్టానంతో సాధ్యమైనంత త్వరగా తెగదెంపులు చేసుకోవడంలో భాగంగానే సోనియాపై దాడికి దిగినట్లు చెబుతున్నారు.

కాగా, వైయస్ జగన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరని సోమవారంనాడు సాక్షి దినపత్రిక వార్తాకథనాలు తెలియజేస్తున్నాయి. సోనియాపై రాసిన వార్తాకథనాన్ని సమర్థించుకుంటూ మరో వార్తాకథనాన్ని సాక్షి ప్రచురించింది. వైయస్ జగన్ కు సాక్షిలో వచ్చిన వార్తాకథనానికి సంబంధం లేదని చెప్పడానికి ప్రయత్నం చేసింది. అయితే, దాన్ని ఎవరూ విశ్వసించడం లేదు. అలాగే, వైయస్ జగన్ కు వ్యతిరేకంగా సాక్షి వార్తాకథనాన్ని ఆసరాగా చేసుకుని కుట్ర చేస్తున్నారని మరో వార్తాకథనాన్ని కూడా ప్రచురించింది. సూత్రధారులెవరంటూ సాక్షి ఆ వార్తాకథనాన్ని ప్రచురించింది. ప్రధానంగా ముఖ్యమంత్రి రోశయ్యను, సీనియర్ నాయకుడు వి. హనుమంతరావును దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X