పావులు కదుపుతున్న చిరంజీవి, ముఖ్యులతో సమావేశం

వైయస్ జగన్ వర్గం కాంగ్రెసు శాసనసభ్యులను చీలిస్తే చిరంజీవి వెంటనే తన మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. అందుకు ప్రతిగా తాను డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పదవిని, మరో ఇద్దరు శాసనసభ్యులకు మంత్రి పదవులు తీసుకోవడానికి కాంగ్రెసు అధిష్టానంతో డీల్ కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై చర్చించేందుకు ప్రజారాజ్యం పార్టీ ముఖ్యులు సమావేశమవుతున్నారు. ఢిల్లీ నుంచి చిరంజీవి కూడా హైదరాబాదుకు బయలుదేరినట్లు తెలుస్తోంది. కాంగ్రెసు కోరితే తాను మద్దతిస్తానని ఆయన స్పష్టంగా చెప్పారు.












Click it and Unblock the Notifications