హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రివర్గం రాజీనామాలకు గవర్నర్ నరసింహన్ ఆమోదం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narasimhan
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా రోశయ్య రాజీనామా అనంతరం ఆయన మంత్రివర్గం రాజీనామా కూడా గవర్నర్ కు చేరింది. రోశయ్యతో పాటు రోశయ్య మంత్రివర్గం రాజీనామాను కూడా గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. దీంతో రోశయ్య మంత్రివర్గంలోని వివిధ శాఖల్లో ఉన్న 33 మంత్రులు రాజీనామా చేసినట్టు అయ్యింది. వీరి రాజీనామాను ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి ప్రసాద్ గవర్నర్ కు పంపారు. జీవో నంబర్ 663లో మంత్రులు, ముఖ్యమంత్రి రాజీనామా వివరణ వచ్చినట్లు సమాచారం.

కాగా రోశయ్య రాజీనామా తన ఇంటికి వచ్చాడు. రోశయ్యను ఆయన ఇంటివద్ద మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జేసి దివాకర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి తదితరులు కలుసుకున్నారు. కాగా సాయంత్రం సిఎల్పీ సమావేశంలో ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ, ఆహ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్ తదితరులు పాల్గొంటారు. ఇప్పటికే వారు ఢిల్లీనుండి హైదరాబాద్ కు బయలుదేరారు. కాగా కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే వరకు రోశయ్య ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X