కళంకిత మాజీ మంత్రులను మళ్లీ కేబినెట్లోకి తీసుకోవద్దు: టిడిపి

వైఎస్ హయాంలో మంత్రులు లక్షలకోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారన్నారు. కొండలు, గుట్టలు కొల్లగొట్టి రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. అలాంటి మంత్రులను తీసుకుంటే అవినీతి మరింత పెచ్చరిల్లుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర ఆదర్శ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అశోక్ చవాన్ను, కామన్వెల్తుతో ఆరోపణలు ఎదుర్కోన్న కల్మాడిని, 2జి స్పెక్ట్రంలో రాజాపై చర్యలు తీసుకున్నానని చెప్పే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ పార్లమెంటు సభ్యులను అందించిన ఆంధ్రప్రదేశ్ ల జరుగుతున్న అవినీతినిపై ఎందుకు మౌనంగా ఉంటారని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని అంతా మీడియా బయట ప్రజలకు చూపించిందని, అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం స్పందించటం లేదని ఆయన అన్నారు. కళంకిత మంత్రులను తీసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం ఊరుకోదన్నారు.












Click it and Unblock the Notifications