అధిష్టానం పెంచిన పాము బుస కొట్టింది: జగన్ పై రేవంత్ రెడ్డి

Revanth Reddy
హైదరాబాద్: పాముకు పాలు పోసి పెంచితే ఎలా ఉంటుందో కడప పార్లమెంటరీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వైయస్ జగన్ను చూస్తే ఇప్పుడు కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి తెలిసి వస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాదులోని పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టుభవన్లో అన్నారు. తెలుగుదేశం పార్టీ జగన్ పాము అని మొదటి నుండి చెబుతున్నప్పటికీ అధిష్టనం పెడచెవిన పెట్టి ఆయన అక్రమాలకు వంత పాడిందన్నారు. జగన్ రూపంలో పెంచిన పామే ఇప్పుడు బుస కొట్టిందన్నారు. అయితే కాంగ్రెసు పార్టీ నీచ రాజకీయాలతో తమకు సంబంధం లేదని ఆయన అన్నారు. తమకు ప్రజా సమస్యలు ముఖ్యమన్నారు. వారి రాజకీయ క్రీడలు కట్టిపెట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. వారి గొడవల మధ్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు.

వైయస్ జగన్ ఇప్పుడు సచ్చీలత, విశ్వసనీయత, ఉన్నత విలువల గురించి మాట్లాడుతున్నారని, అయితే ఆయన జగన్ కు విశ్వసనీయతపై నమ్మకముంటే నమ్ముకున్న ప్రజలను మోసం చేసి లక్షలకోట్ల రూపాయలు ఈ ఐదున్నరేళ్లలో రాష్ట్ర ఖజానా నుండి కొల్లగొట్టారని, వాటిని వెంటనే ఖజానాకు తిరిగి ఇవ్వాల్సిందిగా మరో నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావుసూచించారు. 125 సంవత్సరాలు వేడుకలు జరుపుకొని 15 రోజులు పూర్తికాకముందే ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెసు, జగన్ కొట్టుకుంటున్నాయని ఆయితే వారు వాటిని పక్కకు పెట్టి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. వారి చర్యలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పంట నష్టపరిహారం, ఉద్యోగుల సమస్యలు నెలకొన్నాయన్నారు. అధిష్టానం వాటాలు అడుగుతుంటే జగన్ ముఖ్యమంత్రి పదవి కావాలని పోరాడుతున్నారన్నారు. అధిష్టానానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే జగన్ అక్రమ లక్షకోట్లపై ఎంక్వయిరీ చేయించాలని డిమాండ్ చేశారు. ఆ అక్రమాలన్నీ బయటపడితే రాష్ట్ర ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+