వైయస్ జగన్ పై కాంగ్రెసు అధిష్టానం చాలా ఓపిక పట్టింది: దామోదర్ రెడ్డి

వైయస్ వివేకానంద శాసనసభ్యుడిగా, శాసనమండలి సభ్యుడిగా పని చేశారని, ఆయనతో మాట్లాడితే తప్పేమిటని ప్రశ్నించారు. వివేకానంద పార్టీని బలోపేతం చేస్తాడనే ఆయనతో భేటీ అయ్యారన్నారు. పార్టీ వ్యక్తి అనుకున్నప్పుడు ఓదార్పు యాత్రలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఫోటోలు ఎందుకు పెట్టడం లేదన్నారు. పార్టీకి కుటుంబాన్ని చీల్చాల్సిన అవసరం లేదన్నారు. వైయస్సార్ ను రెండుసార్లు ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెసు అధిష్టానమేనన్నారు.
జగన్ రాజీనామా ఆశ్యర్యకరమైన విషయమేమీ కాదని శాసనమండలి సభ్యుడు యాదవరెడ్డి అన్నారు. ఆయన కొత్త పార్టీకి ప్రణాళికలు తయారు చేసుకున్నాడని తాను ఎప్పుడో చెప్పానని గుర్తు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని, కుటుంబాన్ని ముక్కలు చేస్తుందనడం చెప్పడానికే తప్ప ఆయన పార్టీనుండి బయటకు వెళ్లడానికి కారణాలు మాత్రం కావన్నారు. వివేకానందరెడ్డి సీనియర్ అని ఆయనతో పార్టీ నాయకులు చర్చిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. ఆయనకేదో మంత్రి పదవి ఇస్తారంటే విడిపోయారనేది శుద్ధ అబద్దమన్నారు. చెన్నారెడ్డి కూడా కొత్త పార్టీ పెట్టి మళ్లీ కాంగ్రెసు లోకే వచ్చారన్నారు.












Click it and Unblock the Notifications