హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ అధికారి అక్రమాస్తులు రూ. 5 కోట్లు: ఎసిబి దాడుల్లో వెల్లడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రాజధానిలో మరో అవినీతి చేప బయటపడింది. మెహదీపట్నానికి చెందిన ప్రభాకర్ అనే ట్రాన్సుకో ఏఈ ఇంటిపై ఎసిబి దాడులు నిర్వహించింది. ఆ దాడులలో సుమారు 5కోట్ల వరకు అక్రమ ఆస్తులు బయట పడినట్టు సమాచారం. మాదన్నపేటలో 6 ఇళ్లు, రూపాయలు 70వేలు ఎసిబి అధికారులు కనుగొన్నారు.

గన్నవరంలో సైతం 9 ఎకరాల భూమి కలిగిన కాగితాలు లభించాయి. ప్రభాకర్ ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఎసిబి అధికారులు సోదాలు చేశారు. అయితే సోదాలు పూర్తయ్యే వరకు మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశాలు ఉన్నాయి. మొత్తం పది కోట్ల రూపాయల అస్తులు ఎసిబి సోదాల్లో తేలాయి. అయితే, వాటిలో ఐదు కోట్ల రూపాయల ఆస్తులు అక్రమమని తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X