హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేపటి నుంచి ఆరు రోజుల పాటు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు ఆరు రోజలు పాటు మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రాన్ని వివిధ రకాల సమస్యలు పట్టిపీడిస్తుంటే వాటిపై చర్చించేందుకు అవకాశం లేకుండా ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకోవడాన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు తప్పుబడుతున్నారు. సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలన్న ప్రతిపక్షాల డిమాండ్ ను ప్రబుత్వం తోసిపుచ్చింది. ఏడాదికి 52 రోజుల పాటు సభ జరగాలన్న నిబంధనను పూరించడానికి బడ్జెట్ సమావేశాలకు ముందు మరోసారి సభ సమావేశం కానుంది.

అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన గురువారం ఉదయం జరిగింది. ఈ భేటీకి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి, తెదేపా నేతలు అశోక్ గజపతి రాజు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, సీపీఎం, సీపీఐ, ఎంఐఎం, తెరాస శాసనసభ్యులు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యే సభలో ఎలాంటి ప్రశ్నోత్తరాల సమయం లేకుండా నేరుగా రైతుల సమస్యపై, వరదలపై చర్చిస్తారు. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యమాల సందర్భంగా విద్యార్థులపై పెట్టిన కేసులపై కూడా చర్చ జరుగుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X