రైతు సమస్యలపై బాబు పాదయాత్ర: కొంత మంది ఎమ్మెల్యేలు డుమ్మా

వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే వరకూ తమ పోరాటం ఆగదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎన్టీఆర్ ఘాట్ నుంచి అసెంబ్లీకి తెదేపా నేతలు పాదయాత్రగా బయల్దేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఎన్టీఆర్ ఘాట్ వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులంతా సంఘటితంగా పోరాడేందుకు ముందుకు రావాలన్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తెలుగుదేశం రాష్ట్రవ్యాప్తంగా రహదారుల దిగ్బందనానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications