కెవిపి బ్రోకర్, కలెక్షన్ కింగ్ అని మేం ఆనాడే చెప్పాం: చంద్రబాబు

అవినీతి, అసమర్థ ప్రభుత్వం వల్లనే రైతులు కన్నీళ్లు పెడుతున్నారని ఆయన అన్నారు. రైతులపై ప్రభుత్వానికి ఏ మాత్రం కనికరం లేదని ఆయన విమర్శించారు. భారీ వర్షాలకు నష్టపోయిన రైతుల రుణాలను రీషెడ్యూల్ చేస్తే సరిపోదని వారికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఆయన అన్నారు. తమ శాసనసభ్యులు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారని ఆయన చెప్పారు. రైతు సమస్యలపై ఎల్లుండి మరోసారి ధర్నా చేస్తామని ఆయన చెప్పారు. అక్రమ సంపాదనను విదేశీ బ్యాంకులకు తరలించి కాంగ్రెసు నాయకులు తిరిగి పెట్టుబడుల రూపంలో దేశంలోకి తెస్తున్నారని ఆయన విమర్సించారు.












Click it and Unblock the Notifications