కెవిపిని టార్గెట్ చేసిన విహెచ్: వివరణ ఇవ్వాలని డిమాండ్

కెవిపి రామచందర్ రావు, వైయస్ జగన్ ఒక్కటే అనుకుంటున్నామని, ఒక్క ఆత్మ పైకి పోతే మరో ఆత్మ ఇక్కడే ఉందని అనుకుంటున్నామని, ఇప్పుడు కెవిపి, వైయస్ జగన్ కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయని భావిస్తున్నామని, ఏడాదిన్నర తర్వాత అవి బయటపడ్డాయని, ఆ భేదాభిప్రాయాలు ఏమిటో కెవిపి చెప్పాలని ఆయన అన్నారు. కెవిపి ఆరోపణలు తన సొంతమేనని కొండా సురేఖ చెబుతున్నా వైయస్ జగన్ నుంచో, వైయస్సార్ కుటుంబం నుంచో మాత్రమే ఆ బహిరంగ లేఖ వచ్చిందని ఆయన అన్నారు. ఓ వైబ్ సైట్ కథనం ఆధారంగా రిలయన్స్ కార్యాలయాలపై దాడులు జరిగినప్పుడు కెవిపి భద్రతా సలహాదారుగా ఉన్నారని అంటున్నారని ఆయన అన్నారు. కెవిపి, వైయస్ జగన్ లావాదేవీల కొట్లాట వల్ల కాంగ్రెసు పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. తాము తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications