వైయస్ జగన్ కొత్త పార్టీ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ?

వైయస్ రాజశేఖర రెడ్డి ద్వారా ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టించింది వైయస్ విజయమ్మేననే ప్రచారం ఉంది. తల్లిని పార్టీ అధ్యక్షురాలిగా పెడితే ఆ రకంగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీకి, శాసనసభా సభ్యత్వానికి వైయస్ విజయమ్మ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వైయస్ జగన్ పార్టీకి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వచ్చే 45 రోజుల్లో పార్టీని స్థాపిస్తానని వైయస్ జగన్ ఇప్పటికే చెప్పారు. అయితే, అంతకన్నా ముందుగానే ఆయన తన పార్టీని స్థాపించే అవకాశం ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications