బాబు, జగన్ పొలిటికల్ ఎఫెక్ట్: కిరణ్ కుమార్ కు కేంద్రం చేయూత

రాష్ట్ర ప్రభుత్వం 1000కోట్ల రూపాయల ప్యాకేజీని అడగింది. అయితే కేంద్రం రూ.500 కోట్లు ప్యాకేజీని ప్రకటించింది. రంగు వెలిసిన, తడిసిన ధాన్యం కొనేందుకు భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) కొంత నిబంధనలకు సడలించే అవకాశం ఉంది. అంతేకాకుండా భారత ప్రత్తి సమాఖ్య(సిసిఐ) కూడా పత్తి కొనుగోలుపై ఉదారంగా వ్యవహరించనుంది. రైతులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించి కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం కలిగించాలని ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పోన్ చేసి రాష్ట్ర పరిస్థితులపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 17వ తేదీ నుంచి నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించగా వైయస్ జగన్ ఈ నెల 21, 22 తేదీల్లో విజయవాడలో 48 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది.












Click it and Unblock the Notifications