పసిడి రేట్లల్లో అనూహ్యం- రేంజ్ బౌండ్
ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. దీని ప్రభావంతో శుక్రవారం భారత్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఇంకా అనిశ్చితంగా ఉండటం వల్ల, క్రూడ్ ఆయిల్ ధరల తగ్గుదల అందించిన స్వల్ప మద్దతుతో బంగారం ధరలు ఒక స్థాయిలోనే కొనసాగడం (Range Bound) ప్రాధాన్యతను సంతరించుకుంది.
బులియన్ వెబ్సైట్ తాజా గణాంకాల ప్రకారం నేడు భారత్లో 10 గ్రాముల బంగారం ధర 1,58,570 రూపాయలుగా నమోదైంది. కిలో వెండి ధర 2,62,050 రూపాయల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. సింగపూర్లో ఈ ఉదయం 10 గంటల సమయానికి స్పాట్ గోల్డ్ 0.6 శాతం తగ్గి 4,447.22 డాలర్ల కొనసాగింది. కిలో వెండి 1.6 శాతం నష్టపోయింది. 72.70 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,58,240 రూపాయల వద్ద రిటైల్ అవుతోంది. కోల్కతాలో రూ. 1,58,030గా ఉండగా, దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,57,970గా నమోదైంది. బులియన్ మార్కెట్ నివేదికల ప్రకారం ఈ ప్రధాన నగరాల్లో ధరల మధ్య స్వల్ప వ్యత్యాసాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశ రాజధాని కంటే ముంబై, కోల్కతా మార్కెట్లలో ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి.
దక్షిణాది రాష్ట్రాల బులియన్ మార్కెట్లలో బంగారం ధరలు దేశంలోనే అత్యధికంగా నమోదవుతున్నాయి. చెన్నైలో అత్యధికంగా 10 గ్రాములకు రూ. 1,58,700 ధర పలుకుతుండగా, హైదరాబాద్లో రూ. 1,58,490, బెంగళూరులో 1,58,370 రూపాయలుగా ట్రేడ్ అవుతోంది. ఉత్తరాది నగరాలతో పోలిస్తే దక్షిణాదిలోనే ధరల స్థాయి స్థిరంగా అధికంగా కొనసాగుతోంది.
వెండి ధరల విషయానికొస్తే.. ముంబైలో కిలో వెండి 2,61,640 రూపాయల వద్ద నిలిచింది. ఢిల్లీలో రూ. 2,61,190 వద్ద విక్రయమౌతోంది. చెన్నై, హైదరాబాద్లలో వెండి ధరలు వరుసగా రూ. 2,62,400, రూ. 2,62,050గా ఉన్నాయి. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 2,61,840, కోల్కతాలో 2,61,290 రూపాయలుగా ట్రేడ్ అవుతోంది.












Click it and Unblock the Notifications