మధ్యంతర ఎన్నికలపైనే వైయస్ జగన్ గురి, కెసిఆర్ చూపు కూడా?

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూడా మధ్యంతర ఎన్నికలనే ఆశిస్తారని ఆయన అన్నారు. మధ్యంతర ఎన్నికలు వస్తే రాష్ట్రంలో కాంగ్రెసు తుడిచిపెట్టుకు పోతుందని ఆయన అన్నారు. సీమాంధ్రలో వైయస్ జగన్ పార్టీ స్వీప్ చేస్తుందని, తెలంగాణలో తెరాస స్వీప్ చేస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ మాటలను బట్టి కాంగ్రెసును దెబ్బ కొట్టడానికి కెసిఆర్, వైయస్ జగన్ ఒక్కటవుతారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గానీ ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గానీ తెలంగాణలోనే కాకుండా సీమాంధ్రలోనూ ఏమీ చేయలేరని వారు భావిస్తున్నారు. మధ్యంతర ఎన్నికలను పసిగట్టే రైతు సమస్యలపై చంద్రబాబు నిరాహార దీక్ష చేపట్టినట్లు భావిస్తున్నారు.
శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత పరిస్థితులు రాష్ట్రంలో అదుపు తప్పే ప్రమాదం ఉందని కూడా భావిస్తున్నారు. డిసెంబర్ 31వ తేదీ తర్వాత తీవ్రమైన పరిణామాలుంటాయని, రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు చేయాలని వైయస్ జగన్ భావిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications