హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వెంట వెళ్లినవారికి లేని అధిష్టానం మీకెందుకు: ఈటెల రాజేందర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Etala Rajender
హైదరాబాద్: స్వంత ప్రయోజనాల కోసం మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వెంట వెళ్లిన సీమాంధ్ర నాయకులకు లేని అధిష్టానం మీకెందుకని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులను ప్రశ్నించారు. ప్రభుత్వం మెడలు వంచడానికి దీక్షలు సరిపోవని, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చివేస్తమని అల్టిమేటం ఇవ్వాలని, అప్పుడే కాంగ్రెసు అధిష్టానం దిగి వస్తుందని ఆయన ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులను ఉద్దేశించి అన్నారు.

మాటలు సరిపోవని, కాంగ్రెసు తెలంగాణ నేతలు ఆచరణకు దిగినందుకు సంతోషమని, అయితే దీక్షలు సరిపోవని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులు జెండాలు, పార్టీలు పక్కన పెట్టి ఒక్కటయ్యారని, తెలంగాణ నాయకులు కూడా అలా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మనసుంటే తెలంగాణ ప్రాంత నాయకులు ప్రభుత్వం మెడలు వంచడానికి ముందుకు రావాలని ఆయన అన్నారు. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు కూడా పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X