తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణతో సమస్యలు పరిష్కారం కావు: జయప్రకాష్ నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayaprakash Narayana
తిరుపతి: ప్రత్యేక తెలంగాణతో సమస్యలు పరిష్కారం కావని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ సోమవారం తిరుపతిలో అన్నారు. కొందరు స్వార్థపూరిత రాజకీయ నాయకులు ప్రజల భావోద్వేగాలను వారి స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. రైతుల సమస్యలపై రాజకీయ పార్టీలది మొసలి కన్నీరని ఆయన ఆరోపించారు. ముందుచూపులేని ప్రభుత్వాల వల్లనే రైతులకు, ప్రజలకు సమస్యలు తలెత్తుతున్నాయన్నారు.

రైతులు బిచ్చగాళ్లు కాదన్నారు. వారికి మద్దతు ధర ప్రభుత్వం చెల్లించాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధరను కల్పించి వారికి తలెత్తుకునే పరిస్థితి కల్పించాలన్నారు. ప్రభుత్వానికి ముందుచూపు కొరవడినందువలన ఇటు రైతులు, అటు వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. మార్కెటింగ్ మోసాలతో రైతులు నలిగి పోతున్నారన్నారని, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని చెప్పారు. ప్రభుత్వం 2జి స్పెక్ట్రం లేసెన్సులు రద్దు చేయాలన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X