Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రముఖ తెలుగు కవి గుడిహాళం రఘునాథం కన్నుమూత

Osmania Arts College
హైదరాబాద్: ప్రముఖ తెలుగు కవి గుడిహాళం రఘునాథం అకాల మృత్యువాత పడ్డారు. గత కొద్ది కాలంగా హైదరాబాదులోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మంగళవారం ఉదయం మరణించారు. ఆయన కాలేయ సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన వయస్సు దాదాపు 55 ఏళ్లు. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యంలో ఎం.ఎ. చేశారు. వరంగల్లులోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ పూర్తి చేశారు. ప్రస్తుతం మెదక్ జిల్లా సదాశివపేట కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు.

ఆయన మహబూబ్ నగర్ జిల్లా అమరచింతలో జన్మించారు. తెలుగు కవిత్వంలో తనదంటూ ఓ ముద్రను వేసుకున్న గుడిహాళం రఘునాథం మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటు. తన తొలి కవితా సంపుటి ఫోర్త్ పర్సన్ సింగ్యులర్ తోనే తెలుగు కవితా ప్రపంచంలో తనదైన విశిష్టతను చాటి చెప్పారు. ఆ తర్వాత ఒక జననం - ఒక మరణం అనే కవితా సంపుటిని వెలువరించారు. తెలుగు సమాజంలో మార్పును, సాహిత్యంలో కొత్త విలువలను ఆశిస్తూ ఏర్పడిన విపశ్యన కవుల్లో ఆయన ఒకరు. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, ఏసుపాదం, శివకుమార్, కె. శ్రీనివాస్ లతో కలిసి ఆయన నల్లవలస దీర్ఘ కవిత రాశారు. తెలంగాణ కోణం నుంచి వెలువడిన దీర్ఘ కవిత అది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+