ఇక్కడ మనం, అక్కడ వైయస్ జగన్: కెసిఆర్ మధ్యంతర ఆశలు

K Chandrasekhar Rao
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన ప్రకటన తీవ్ర సంచలనం సృష్టించింది. జనవరిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోతాయని ఆయన బుధవారం పార్టీ కార్యవర్గ సమావేశంలో అన్నారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని, దాంతో తెలంగాణలో తాము, సీమాంధ్రలో వైయస్ జగన్ స్వీప్ చేస్తామని ఆయన చెప్పారు. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చునని, మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పార్టీ నాయకులను అప్రమత్తం చేశారు. ఈ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం చెలరేగింది. పలు ఊహాగానాలు చెలరేగాయి.

కెసిఆర్ వైయస్ జగన్ తో అవగాహనకు వస్తున్నారని మీడియా వ్యాఖ్యానించింది. చర్చా కార్యక్రమాలు నిర్వహించింది. వైయస్ జగన్ వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోతాయని కెసిఆర్ అన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం వైయస్ జగన్ కు లేదని శాసనసభ్యురాలు కొండా సురేఖ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పడిపోతే, దానంతటదే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని ఆమె అన్నారు. వైయస్ జగన్ కు తెలంగాణలో కూడా చెప్పుకోదగ్గ సీట్లు వస్తాయని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+