హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నివేదిక అధ్యయనానికి గడువు ఇవ్వండి: బహిరంగ లేఖలో చిరంజీవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: తెలంగాణ అంశంపై అఖిలపక్షం కోసం హోంమంత్రి చిదంబరం పార్టీలను అహ్వానించిన తీరు అభ్యంతరకరంగా ఉందని ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి శుక్రవారం చిదంబరానికి రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన 600 పేజీల నివేదికపై వెంటనే పార్టీల అభిప్రాయం చెప్పాలనటం సమంజసం కాదన్నారు. నివేదికను అధ్యయనం చేయడానికి కొంత సమయం తీసుకుంటుందన్నారు. అందుకు కేంద్రం అన్ని పార్టీలకు కొంత గడువు ఇవ్వాలని సూచించారు.

కాగా ఆయన అనంతరం ఆయన మాట్లాడారు. అలమట్టి ఎత్తు పెంపుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిదే పూర్తి బాధ్యత అని అన్నారు. దేవేగౌడను నేనే ప్రధానమంత్రిని చేశానన్న చంద్రబాబు అలమట్టి ఎత్తుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై కేంద్రంపై రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా ఒత్తిడి తీసుకు రావాలన్నారు. జనవరి 3వ తారీఖునుండి ఖమ్మం, నల్గొండలలో రైతు పరామర్శలు ఉంటాయని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X