హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ జ్యోతిష్కుడిని మార్చుకోవాలి: మంత్రి రఘువీరా రెడ్డి సలహా

By Pratap
|
Google Oneindia TeluguNews

Raghuveera Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తన జ్యోతిష్కుడిని మార్చుకోవాలని రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డి సలహా ఇచ్చారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని కెసిఆర్ చేసిన వ్యాఖ్యపై ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ విధంగా ప్రతిస్పందించారు. తప్పు జోస్యం చెప్పడం కెసిఆర్ కు అలవాటు అని, కెసిఆర్ కు జ్యోతిషంపై నమ్మకం ఎక్కువ అని ఆయన అన్నారు. కెసిఆర్ జ్యోతిషం చెప్పడం మానుకోవాలని ఆయన సూచించారు.

రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కూడా రాదని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్రం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు. తాము తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పులో రాష్ట్రానికి న్యాయం జరగలేదన్నది నిజమని, అయితే న్యాయవాదులు సరిగా వాదించలేదనే మాటలు వాస్తవం కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X