వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెప్పానుగా అదే వచ్చింది: మీడియాతో గవర్నర్ నరసింహన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Governor Narasimhan
న్యూఢిల్లీ: నేను చెప్పినట్లే జరిగిందని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శనివారం న్యూఢిల్లీలో విలేకరుల ప్రతినిధులతో అన్నారు. డిసెంబర్ 31 తర్వాత జనవరి 1 వస్తుందని చెప్పానని అదే వచ్చిందని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గతంలో కూడా విలేకరులు డిసెంబర్ 31 తర్వాత ఏమవుతుంది అని గవర్నర్‌ని అడిగితే ఆయన జనవరి 1 వస్తుందని జోక్ చేశారు. దానిని ఇప్పుడు అదే విలేకరులు గుర్తు చేయగా ఆయన మళ్లీ అదే విధంగా చమత్కరించారు.

కాగా రాష్ట్ర గవర్నర్ గా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి తండ్రిలా వ్యవహరిస్తానని గవర్నర్ చెప్పారు. తాను పాలనలో జోక్యం చేసుకుంటున్నానన్న వార్తలను ఆయన కొట్టి పారేశారు. ఒక గవర్నర్ ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరిస్తానని పాలనతో తనకు సంబంధం లేదన్నారు. రాష్ట్ర పరిస్థితులు 2011లో బాగానే ఉంటాయని చెప్పారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగదని, ఆయితే దానిని ఇప్పుడే పూర్తిగా చెప్పలేమన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికతో తనకు సంబంధం లేదన్నారు. ఈ సంవత్సరంలో రాష్ట్రం మంచి పురోగతి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X