హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ జగనే రాష్ట్రంలో శక్తివంతమైన నాయకుడు: జూపూడి ప్రభాకరరావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డియే అత్యంత శక్తివంతమైన నాయకుడు అని శాసనమండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు అన్నారు. కాంగ్రెస్‌కు మూడోస్థానమే అని జగన్ అన్న విషయంపై కూడా జూపూడి స్పందించారు. తెలుగుదేశం పార్టీయే జగన్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ జగన్‌తోనే ఉంటారన్నారు. జగన్ పార్లమెంటు సభ్యుడిగానే పోటీ చేస్తారని ముందుగా తెలిసిందేనన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే వైఎస్ జగన్ క్లీన్ స్పీప్ చేయడం ఖాయమన్నారు. వైఎస్ జగన్ కు తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారని చెప్పారు. అందుకే ఆయన తెలంగాణలో కూడా ఓదార్పు చేపడతామని నిర్ణయించుకున్నారన్నారు. వైఎస్ కు తెలంగాణలో అభిమానులు లేకుంటా ఆయన మరణం తర్వాత అంతమంది ఎలా చనిపోతారని ఆయన ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X