గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకృష్ణ నివేదికతో రాయలసీమకు అన్యాయం జరిగితే ఊరుకోం: టిజి వెంకటేష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

TG venkatesh
గుంటూరు: శ్రీకృష్ణ నివేదిక వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రజలందరూ సంయమనంతో వ్యవహరించాలని మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆదివారం గుంటూరు జిల్లా పర్యటనలో సూచించారు. ప్రజలు ఎవరూ ఆవేశాలకు లోనుకావద్దన్నారు. తీర్పు న్యాయంగా లేదనుకుంటే రాజ్యాంగబద్దంగా శాంతియుతంగా పోరాడాలని కోరారు. ఆమీర్‌పేట భూముల కుంభకోణంలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. ఆ భూములపై ఏసిబికి పూర్తిగా సహకారం అందిస్తానని చెప్పారు. కృష్ణా ట్రిబ్యునల్‌పై రాష్ట్ర ప్రభుత్వ వాదన సరిగా లేదనడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలంగానే వాదన వినిపించామని చెప్పారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక కారణంగా రాయలసీమను అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని చిన్ననీటి పారుదల శాఖమంత్రి టిజి వెంకటేష్ అన్నారు. రాయలసీమకు తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు. కృష్ణా నీటిపై బ్రజేష్ కమిటీ ఇచ్చిన తీర్పుపై అందరూ అసంతృప్తితో ఉన్నారన్నారు. మేధావులు, నిపుణులతో చర్చించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెంకటేష్ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X