హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమైక్యాంధ్రకు జైకొట్టిన జగనే కెసిఆర్‌కు మహానాయకుడు!: రేవంత్‌రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల ఆత్మహత్యకు తెలంగాణ రాష్ట్ర సమితిదే పూర్తి బాధ్యత అని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్‌‌రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో అన్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్ సమైక్యాంధ్రకు మద్దతుగా ఫ్లకార్డు ప్రదర్శించినప్పుడు మాట్లాడని టీఆర్ఎస్ ఇప్పుడు జగన్ కు మద్దతు పలుకుతుందని విమర్శించారు. తెలంగాణపై ఏ మాత్రం మాట్లాడని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ వీరికి దేవతలా కనిపిస్తుందన్నారు. సమైక్యాంధ్ర అంటూ పలికిక జగన్ వారికి మహానాయకుడిగా కనిపిస్తున్నాడని ఎద్దేవా చేశారు.

కెసిఆర్ సోనియాగాంధీని రక్షించడానికి కుట్ర చేస్తున్నారన్నారు. కేసిఆర్ మారుస్తున్న రంగులు చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందన్నారు. తెరాస పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చూస్తుందన్నారు. తెలంగాణ తరఫున ఉన్న ఏకైక కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి తెలంగాణ విషయంపై ఇంతవరకు పెదవి విప్పలేదని ఆయనపై కెసిఆర్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. కేంద్రమంత్రి చిదంబరం 6న ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షులనే పిలవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తరఫున సోనియా వస్తే టిడీపీ తరఫున చంద్రబాబు వస్తారని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X