సమైక్యాంధ్రకు జైకొట్టిన జగనే కెసిఆర్కు మహానాయకుడు!: రేవంత్రెడ్డి
కెసిఆర్ సోనియాగాంధీని రక్షించడానికి కుట్ర చేస్తున్నారన్నారు. కేసిఆర్ మారుస్తున్న రంగులు చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందన్నారు. తెరాస పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చూస్తుందన్నారు. తెలంగాణ తరఫున ఉన్న ఏకైక కేంద్రమంత్రి జైపాల్రెడ్డి తెలంగాణ విషయంపై ఇంతవరకు పెదవి విప్పలేదని ఆయనపై కెసిఆర్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. కేంద్రమంత్రి చిదంబరం 6న ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షులనే పిలవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తరఫున సోనియా వస్తే టిడీపీ తరఫున చంద్రబాబు వస్తారని అన్నారు.
రేవంత్రెడ్డి చిదంబరం సోనియాగాంధీ చంద్రబాబు తెలంగాణ జగన్ హైదరాబాద్ revanth reddy chidambaram sonia gandhi chandrababu telangana jagan hyderabad
Story first published: Sunday, January 2, 2011, 16:36 [IST]