వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖపట్నం జిల్లాలో వైయస్సార్ విగ్రహం కూల్చివేత కలకలం

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. విశాఖపట్నం జిల్లా మంగళాపురం గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తన ఓదార్పు యాత్రలో భాగంగా మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ మంగళవారం రాత్రి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత రాత్రికి రాత్రి దాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. ఇది కాంగ్రెసువారి పనే అని వైయస్ జగన్ వర్గీయులు ఆరోపిస్తున్నారు.

విశాఖపట్నం జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టిన వైయస్ జగన్ మంగళవారం రాత్రి మాడ్గులలో బస చేశారు. మంగళాపురంలో వైయస్ విగ్రహం కూల్చివేత విషయాన్ని స్థానికులు వైయస్ జగన్ దృష్టికి తెచ్చారు. సంయమనం పాటించాలని ఆయన తన అభిమానులకు సూచించారు. దీనిపై వైయస్ జగన్ వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X