విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ‌ను నమ్ముకోవద్దు: కృష్ణా ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
విజయవాడ: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెసు నుండి చీల్చే ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఎవరూ ఆశలు పెట్టుకోవద్దని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం కృష్ణా జిల్లా శాసనసభ్యులకు సూచించినట్టు తెలుస్తోంది. పంట నష్టపోయిన రైతుల మూడురోజుల పరామర్శలో భాగంగా మంగళవారం చంద్రబాబు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వారికి క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

చీల్చే ఓట్లపై మనము నమ్మకం పెట్టుకోవద్దని వారికి చంద్రబాబు సూచించినట్టుగా తెలుస్తోంది. ఎవరు తప్పు చేసిన ప్రజల మధ్య ఎండగట్టాలని ఆయన వారికి సూచించినట్టుగా తెలుస్తోంది. తప్పు చేసిన వారు కాంగ్రెసు వారు అయినా, ప్రజారాజ్యం అయినా, జగన్ అయినా ఎవ్వరినీ వదిలి పెట్టవద్దన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X