హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు: బిజెపి అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
హైదరాబాద్: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే దిశలో కేంద్ర ప్రభుత్వం తన అడుగులు వేస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్‌పేట శాసనసభ్యుడు గంగారపు కిషన్‌రెడ్డి బుధవారం అన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని కోరుతూ జనవరి 27వ తేదిన మండలస్థాయిలో నిరసనలు తెలియజేస్తామని చెప్పారు.

ఫిబ్రవరి 1వ తేది నుండి గ్రామస్థాయిలో ఆ నిరసనలు తెలియజేస్తామని చెప్పారు. ఫిబ్రవరి చివరి వారంలో పల్లెపిలుపు ఉంటుందని చెప్పారు. వచ్చేనెల 15న తెలంగాణపై కేంద్రం తీరు ఎండగట్టడానికి ఎన్డీయే ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్లే రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడిందని విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X