ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ వెంట వెళ్లినందుకు ఎమ్మెల్యే కుంజా సత్యవతిపై ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
ఖమ్మం: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వెంట వెళ్లినందుకు శాసనసభ్యురాలు కుంజా సత్యవతిపై ఖమ్మం జిల్లా భద్రాచలం కాంగ్రెసు నాయకులు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ఆమెపై ఎనిమిది మండలాల నాయకులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. వైయస్ జగన్ ఢిల్లీలో చేపట్టిన జలదీక్షకు ఆమె మంగళవారం హాజరయ్యారు.

పార్టీని కాదని జగన్ వెంట వెళ్లినందుకు కుంజా సత్యవతి రాజీనామా చేయాలని కాంగ్రెసు నియోజకవర్గం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంటు సభ్యుడు బలరామ్ నాయక్ కుంజా సత్యవతిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పార్టీ మారినా కుంజా సత్యవతిని తాము గెలిపించామని, డబ్బుల కోసం ఆమె జగన్ వెంట వెళ్లారని ఆయన అన్నారు. తమ పార్టీకి ఏ విధమైన నష్టం ఉండదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X