వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రణబ్ ముఖర్జీతో తెలంగాణ పార్లమెంటు సభ్యులు తేల్చుకుంటారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress Telangana MPs
న్యూఢిల్లీ: తెలంగాణపై అమితుమీ తేల్చుకునే దృఢచిత్తంతో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర మనస్తాపానికి గురై కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు మంగళవారం సమావేశం నిర్వహించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ నుంచి వారికి ఆహ్వానం అందింది. వారు బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. తెలంగాణపై తాము ప్రణబ్ ముఖర్జీతో తేల్చుకుంటామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులంటున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఏ విధమైన వ్యాఖ్యలు చేయవద్దని కాంగ్రెసు అధిష్టానం ఆదేశించినా వారు పట్టించుకోలేదు.

వైయస్ జగన్ వెంట వెళ్లిన ప్రజాప్రతినిధులకు లేని హైకమాండ్ తమకే ఉందా అని కూడా ప్రశ్నించారు. కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు రాయపాటి, కావూరి, లగడపాటి శ్రీకృష్ణ కమిటీ సభ్యులకు ముడుపులు ఇచ్చారని మధు యాష్కీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పార్లమెంటు సభ్యులు ప్రణబ్‌ను కలుస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని, లేకుంటే తాము ప్రజల్లోకి వెళ్లలేమని వారంటున్నారు. వీరి వాదనలను పార్టీ అధిష్టానం సానుభూతితో వింటుందా అనేది అనుమానమే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X