డిఎల్ రవీంద్రా రెడ్డి వర్సెస్ వైయస్ జగన్: మంత్రుల మండిపాటు

కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చేరిన తర్వాత రవీంద్రా రెడ్డి వైయస్ జగన్ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. చీమూ నెత్తురు ఉంటే వైయస్ జగన్ తన వర్గం శాసనసభ్యులతో రాజీనామాలు చేయించాలని ఆయన సవాల్ చేశారు. తన దయాదాక్షిణ్యాల మీద ప్రభుత్వం మనుగడ సాగిస్తోందని, తాను తలుచుకుంటే ప్రభుత్వం పడిపోతుందని వైయస్ జగన్ అనడంపై ఆయన ఆ సవాల్ విసిరారు. అయితే, రవీంద్రారెడ్డి మాటలు జగన్ను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని సహచర మంత్రులు అంటున్నట్లు సమాచారం. జగన్ను రెచ్చగొడితే శాసనసభ్యులతో రాజీనామాలు చేయిస్తే ప్రభుత్వం అస్థిరం పాలు కావడం తప్పదని, ఈ వాస్తవాన్ని గుర్తించి డిఎల్ రవీంద్రా రెడ్డి మాట్లాడాలని వారంటున్నారని సమాచారం. ఒక సందర్భంలో డిఎల్ రవీంద్రారెడ్డిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయాలని అనుకున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications