వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీ ప్రకటనపై మండిపడుతున్న ఎన్ ‌సిపి

By Pratap
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
న్యూఢిల్లీ: సంకీర్ణ ప్రభుత్వం అనివార్యం కావడం వల్లనే ధరల పెరుగుదలను అరికట్టలేకపోతున్నామని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాందీ చేసిన ప్రకటనపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్‌సిపి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాహుల్ ప్రకటన యుపిఎ కీలక భాగస్వామి ఎన్‌సిపికి కోపం తెప్పించింది.

ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తన నాయనమ్మ ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెసు ఒకే పార్టీ అధికారంలో ఉందని, దాంతో ధరలను ఇందిరా గాంధీ అదుపు చేయగలిగారని, ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం కావడంతో సాధ్యం కావడం లేదని ఆయన అన్నారు. రాహుల్ ప్రకటనపై ఎన్‌సిపి నేత తారిఖ్ అన్వర్ మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీ వాస్తవాలను అర్థం చేసుకోవాలని, ధరల పెరుగుదలను కట్టడి చేయడాన్ని ఉమ్మడి బాధ్యతగా స్వీకరించాల్సి ఉంటుందని, ఏ ఒక్క వ్యక్తికో సంబంధించిన విషయం కాదని ఆనయ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X