వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెసు, టిడిపి మధ్యే పోటీ: జగన్ పార్టీపై ఎంపీ రాయపాటి పరోక్ష వ్యాఖ్య
శ్రీకృష్ణ కమిటీ సభ్యులకు ముడుపులు ఇచ్చారని అంటున్న నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ వ్యాఖ్యలను రాయపాటి ఖండించారు. ఆయన మాటలు అర్థరహితం అని అన్నారు. ముడుపులు ఇచ్చారంటున్న వారు రుజువులు చూపించాలని డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యులను ఎక్కువ సార్లు కలిసింది తెలంగణ పార్లమెంటు సభ్యులనే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ఆయన వ్యాఖ్యలు బాధాకరం అన్నారు. నిరాధార అరోపణలు తగదన్నారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కకపోవటం ఎంపీ కావూరి సాంబశివరావుకు అసంతృప్తి ఉన్నట్లే తనకూ ఉందని ఆయన అన్నారు.
Comments
రాయపాటి సాంబశివరావు వైయస్ జగన్ మధు యాష్కీ శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ కాంగ్రెసు న్యూఢిల్లీ rayapati sambasiva rao madhu yashki srikrishna committee telangana congress new delhi
Story first published: Wednesday, January 12, 2011, 16:16 [IST]