వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసు, టిడిపి మధ్యే పోటీ: జగన్ పార్టీపై ఎంపీ రాయపాటి పరోక్ష వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rayapati Sambasiva Rao
న్యూఢిల్లీ: రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్యే పోటీ ఉంటుందని మరెవరూ ఈ పోటీలోకి రాలేరని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఉద్దేశించి గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు బుధవారం న్యూఢిల్లీలో విలేకరులతో అన్నారు. కృష్ణా నీటిపై బ్రజేష్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్రానికి నష్టం జరిగిన విషయం వాస్తవమే అని, అయితే జగన్ ఆవిషయంపై జలదీక్ష పేరుతో బల ప్రదర్శనకు పూనుకున్నారని అభిప్రాయపడ్డారు. అవినీతి మంత్రులను ప్రోత్సహిస్తే ఫలితమెలా ఉంటుందో 2014 సాధారణ ఎన్నికల్లో తెలుస్తుందని అన్నారు.

శ్రీకృష్ణ కమిటీ సభ్యులకు ముడుపులు ఇచ్చారని అంటున్న నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ వ్యాఖ్యలను రాయపాటి ఖండించారు. ఆయన మాటలు అర్థరహితం అని అన్నారు. ముడుపులు ఇచ్చారంటున్న వారు రుజువులు చూపించాలని డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యులను ఎక్కువ సార్లు కలిసింది తెలంగణ పార్లమెంటు సభ్యులనే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ఆయన వ్యాఖ్యలు బాధాకరం అన్నారు. నిరాధార అరోపణలు తగదన్నారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కకపోవటం ఎంపీ కావూరి సాంబశివరావుకు అసంతృప్తి ఉన్నట్లే తనకూ ఉందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X