వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ వ్యాఖ్యలు వట్టిగానే మిగిలిపోతాయి: అభిషేక్ సింఘ్వీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Abhisek Singvi
న్యూఢిల్లీ: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యలను తాము అంత సీరియస్‌గా తీసుకోవటం లేదని ఏఐసిసి అధికార ప్రతినిధి అభిషేస్ సింఘ్వీ బుధవారం న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. జగన్ విషయంలో మీడియా వాస్తవాలను దాచిపెట్టి అబద్దాలు ప్రచారం చేస్తుందని అన్నారు. అబద్దాలు ప్రచారం చేయడం మీడియాకు తగదని ఆయన వ్యాఖ్యానించారు.

జగన్ న్యూఢిల్లీలో దీక్ష చేపట్టి అందులో పాల్గొన్న ఎమ్మెల్యేలను హెచ్చరిస్తారా అన్న ప్రశ్నకు మర్యాదస్తులు ఎవరినీ బెదిరించరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మర్యాదగానే ఉంటుందని చెప్పారు. అయితే వారు హద్దులు దాటడాన్ని పార్టీ అధిష్టానం గమనిస్తోందని చెప్పారు. వారిపై సరియైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జగన్ పార్టీ వల్ల వచ్చిన నష్టమేమీ కాంగ్రెస్‌కు లేదన్నారు. ప్రభుత్వాన్ని కూలగొడతానన్న జగన్ కూలగొట్టకుంటే అవి వట్టిమాటలుగానే మిగిలిపోతాయన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X