భూను అతి విలువైన ఎకరాల కొద్దీ భూములు కొన్నాడా, కబ్జా చేశాడా?
భాను తదితరులు ఆయా స్థలాల సొంతదారుల నుంచి డబ్బు చెల్లించి కొన్నారా, బెదిరించి రాయించుకున్నారా అన్న అంశాలపై విచారణ సాగిస్తున్నారు. ఈ 35 ఎకరాలు భాను బినామీ పేర్లతో ఉన్న విషయం సూరికి తెలుసునని పోలీసులు వెల్లడించారు. మంచిరేవులలో 26 ఎకరాలు సొంతం చేసుకోవడమంటే భారీస్థాయిలో బెదిరింపులకు పాల్పడి ఉంటారని ఒక పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డు, ఖరీదైన అపార్టుమెంట్లు వస్తాయన్న సమాచారం తెలుసుకున్నాకే సూరి బృందం సెటిల్మెంట్ల ద్వారా ఆయా స్థలాలు సంపాదించినట్లు వెల్లడైంది.
Comments
Story first published: Thursday, January 13, 2011, 8:42 [IST]