హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భూను అతి విలువైన ఎకరాల కొద్దీ భూములు కొన్నాడా, కబ్జా చేశాడా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన అనుమానితుడు భానుకిరణ్‌ ఆస్తులను పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. హైదరాబాదు, హైదరాబాదు శివారు ప్రాంతాల్లో అతను పెద్ద యెత్తున భూలావాదేవీలు నడిపినట్లు తెలుస్తోంది. రాజేంద్రనగర్, ఉప్పల్, శేర్ లింగంపల్లి, గచ్చిబౌలీ, మహేశ్వరం వంటి పలు ప్రాంతాల్లో విలువైన భూములు భాను పేరు మీద, సూరి అనుచరుల పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌ శివార్లలోని ప్రధాన ప్రాంతాలు మంచిరేవులలో 26 ఎకరాలు, కొండాపూర్‌లో 9 ఎకరాలు భాను బినామీ పేర్లతో ఉన్నట్టు తెలిపే ఆధారాలను సేకరించారు. ప్రస్తుత మార్కెట్‌ రేటు ప్రకారం ఎకరా రూ.5 కోట్లు ఉంటుందని అంచనా. ఈ లెక్కన వీటి విలువ రూ.175 కోట్లు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

భాను తదితరులు ఆయా స్థలాల సొంతదారుల నుంచి డబ్బు చెల్లించి కొన్నారా, బెదిరించి రాయించుకున్నారా అన్న అంశాలపై విచారణ సాగిస్తున్నారు. ఈ 35 ఎకరాలు భాను బినామీ పేర్లతో ఉన్న విషయం సూరికి తెలుసునని పోలీసులు వెల్లడించారు. మంచిరేవులలో 26 ఎకరాలు సొంతం చేసుకోవడమంటే భారీస్థాయిలో బెదిరింపులకు పాల్పడి ఉంటారని ఒక పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ఖరీదైన అపార్టుమెంట్లు వస్తాయన్న సమాచారం తెలుసుకున్నాకే సూరి బృందం సెటిల్‌మెంట్ల ద్వారా ఆయా స్థలాలు సంపాదించినట్లు వెల్లడైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X