హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గవర్నర్ నరసింహన్‌తో చిరంజీవి రహస్య భేటీ, మద్దతుపై చర్చ

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి గురువారం గవర్నర్ నరసింహన్‌తో రహస్యంగా సమావేశమయ్యారు. పార్టీ ముఖ్య నేతలకు కూడా తెలియకుండా ఆయన వచ్చి రాజభవన్‌లో గవర్నర్‌ను కలిశారు. తాజా రాజకీయాలపై చిరంజీవితో నరసింహన్ చర్చించినట్లు తెలుస్తోంది. నరసింహన్‌తో చిరంజీవి భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి చోటు చేసుకుంది. గురువారం ఉదయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నరసింహన్‌తో దాదాపు గంట సేపు సమావేశమయ్యారు. ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందనే వ్యాఖ్యలు వస్తున్న తరుణంలో ఈ భేటీ జరిగింది.

మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వెంట ఎంత మంది వెళ్తారు, ప్రభుత్వానికి మద్దతిచ్చే ఇతర పార్టీలు ఏవి అనే విషయాలను నరసింహన్ కిరణ్ కుమార్ రెడ్డిని అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు. ఈ తరుణంలో కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతిచ్చే విషయంపై చిరంజీవితో గవర్నర్ మాట్లాడినట్లు చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు ఎంత మంది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతిచ్చే నిర్ణయానికి కట్టుబడి ఉంటారనే విషయాన్ని కూడా నరసింహన్ చిరంజీవిని అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X