చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌ కు డిపాజిట్ వస్తే ఉరేసుకొని చస్తా: మంత్రి శంకర్‌ రావు సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

P Shankar Rao
చిత్తూరు: మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్‌ రెడ్డికి దమ్ముంటే తనపై రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేసి గెలవాలని చేనేత, జౌళీ శాఖమంత్రి శంకర్‌ రావు సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఎక్కడైనా జగన్ పెట్టే పార్టీ పోటీ చేసి డిపాజిట్ దక్కించుకుంటే ఉరేసుకొని చస్తానని సవాల్ చేశారు. తెలంగాణలో సైతం ఎక్కడైనా పోటీ చేసి గెలిస్తే రాజకీయాలనుండి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పారు.

జగన్ ‌ను ప్రజలు మాజీ ముఖ్యమంత్రి కొడుకుగానే చూస్తున్నారన్నారు. ఆయన పెట్టే పార్టీకి కాంగ్రెసు‌పై గెలిచే సత్తా లేదన్నారు. పార్టీ అండతోనే జగన్ ఎదిగిన విషయాన్ని మరిచిపోయాని ఆరోపించారు. ఆయన పలుమార్లు జగన్‌ను లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారు. కాగా శంకర్‌ రావు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X