కెసిఆర్పై అంజన్ మండిపాటు: ఆ రెండూ కావాలన్న సికింద్రాబాద్ ఎంపీ

ఈ సందర్భంగా ఎంపీ టిఆర్ఎస్పై, కెసిఆర్పై ధ్వజమెత్తారు. తనకు తెలంగాణ కావాలి, అలాగే మంత్రి పదవీ కావాలని చెప్పారు. తనను ఎంపీ పదవికి రాజీనామా చేయమని అడగడమేమిటని వారిని ప్రశ్నించారు. తెలంగాణ సెంటిమెంటు పేరు చెప్పి కేసిఆర్ ఎంపీ కావచ్చు, మంత్రి పదవులు పొందవచ్చు. కానీ బలహీనవర్గాలకు చెందిన తాము మాత్రం రాజీనామా చేయాలా అని ప్రశ్నించారు. కెసిఆర్ తెలంగాణను సెంటిమెంటుకోసం ఉపయోగించుకున్నారన్నారు. తెలంగాణ పేరుతో కుటుంబ సభ్యులంతా పార్టీలో చేరిపోయారన్నారు. కెసిఆర్తో పాటు రాష్ట్రంలో నాయిని నర్సింహారెడ్డి, హరీష్రావు తదితరులు మంత్రి పదవులను పొందారన్నారు. అగ్రవర్ణాలకు చెందిన వారు ఉద్యమంలో బలహీన వర్గాలను బలి చేస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications