హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ప్రాంతానికి తొలిసారి అడ్వొకేట్ జనరల్ వదవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత తొలిసారి తెలంగాణ ప్రాంతానికి అడ్వొకేట్ జనరల్ పదవి దక్కింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన సుదర్శన్ రెడ్డి అడ్వొకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తికి అడ్వొకేట్ జనరల్ పదవి దక్కలేదు. దీనిపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు, తెలంగాణ న్యాయవాదులు పదే పదే విమర్సలు చేస్తున్న నేపథ్యంలో సుదర్శన్ రెడ్డి అడ్వొకేటే జనరల్‌గా నియమితులయ్యారు. అదే సమయంలో తెలంగాణవాదులను కొంత మేరకు సంతృప్తిపరచే ఉద్దేశంతో కూడా ఈ నియామకం జరిగినట్లు చెబుతున్నారు.

ఇదిలావుంటే, సుదర్శన్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితులని తెలుస్తోంది. వీరిద్దరు హైదరాబాదులో కలిసి చదువుకున్నట్లు చెబుతున్నారు. అంతకు ముందు మంత్రి ఎరాసు ప్రతాప రెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. అడ్వొకేట్ జనరల్ పదవి తెలంగాణవారికే దక్కుతుందని భేటీ అనంతరం ఆయన చెప్పారు. ఈ మేరకు తెలంగాణకు చెందిన సుదర్శన్ రెడ్డి అడ్వొకేట్ జనరల్‌గా నియమితులయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X